గెలుపే దిశగా దూసుకుపోతున్న కారు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండల్ నర్సింగ్ తాండ గ్రామ పంచాయతీ % ఇబ్రహీంపల్లి గ్రామంలో జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డా”సి. లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలు భారత రాష్ట్ర సమితి పార్టీకి బాసటగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల నాయకులు ముమ్మరంగా ప్రచారం చేశారు. ప్రతి ఇంటింటికి తిరిగి భారత రాష్ట్ర సమితి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, జడ్పీటిసి మోహన్ నాయక్, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ మండల్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, మాజీ ఎంపీపీ హన్మగాళ్ల నర్సింహులు, సర్పంచ్ల సంఘం మండల్ అధ్యక్షులు బాచ్చిరెడ్డి, ఆనంద్ గౌడ్, మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, బిఆర్ఎస్ మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *