రేగొండ,నేటిధాత్రి:
ఉపాధి హామీ పనులకు రావాలని బుధవారం ఉపాధి హామీ సిబ్బంది అన్ని గ్రామ పంచాయతీల ఉపాధి హామీ కూలీలను విస్తృతంగా కోరారు.అన్ని గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీలు పనులు ప్రారంభం కాగా కూలీల రోజు వారి కూలీల 400 పైగా పలుకుతుంది ఈ మేరకు కూలీలు ఉపాధి హామీ పథకం వైపు మొగ్గుచూపక పోవడంతో అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రజాపాలనలో ఒక గ్యారెంటీ అయిన ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించినందున ఇట్టి పథకాన్ని విజయవంతం చేయాలని కోరారు.అదనపు ప్రోగ్రామ్ అధికారి జమీర్ పాషా మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి పనులు అన్నీ ఎక్కువ శాతం ఉపాధి హామీ నిధులతోనే చేస్తున్నామని ఉపాధి హామీ పనులకు ఉపాధి హామీ కూలీలు ఎక్కువ సంఖ్యలో వచ్చి అనేక అభివృద్ధి పనులు గ్రామంలో చేసుకోవచ్చని అన్నారు. సిసి రోడ్లు, సిసి డ్రైన్లు, గ్రామపంచాయతీ భవనాలు,అంగన్వాడి భవనాలు, స్కూల్ టాయిలెట్లు అన్నీ గ్రామ ఉపాధి హామీ నిధులతోనే చేస్తున్నామన్నారు. కావున ఉపాధి హామీ పనులకు కూలీలు ఎక్కువ సంఖ్యలో రావాలని కోరారు అందులో భాగంగానే విన్నుతంగా ఇంటి ఇంటికి వెళ్లి పనులు రావాలని బొట్టు పెట్టి మరి ఆహ్వానిస్తున్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ప్రోగ్రామ్ అధికారి యస్.కె జమీర్ పాష, టెక్నికల్ అసిస్టెంట్ డి.రాజు, యన్.రాజు, ప్రకాష్, రమేష్, రాంబాబు, ఫీల్డ్ అసిస్టెంట్ లు సుజాత, చిరంజీవి, శ్యామ్ , రమేష్, మెట్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.