సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా మండల కమిటీ డిమాండ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీల పరిస్థితి నిధుల కొరతతో అభివృద్ధికి తీవ్ర జాప్యం ఏర్పడుతుందని కనీసం గ్రామపంచాయతీ వీధిలో లైట్లు గాని పారిశుద్ధ్యం బ్లీసింగ్ పౌడర్ దోమల మందులు కొట్టడం కానీ పారిశుద్ధ్య ఇతర నిర్వహణ గాని ఎటువంటి కార్యక్రమాలు సరిగా జరగకపోవడం గ్రామాలలో విష జ్వరాలు ప్రబులుతున్న పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి. ఇదే విషయాన్ని మండల అధికారులు జిల్లా అధికారులకు తెలియజేసిన రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు సరిగా రావడం లేదని ఎంపీడీవో స్థాయి అధికారులకు చెప్పినా కూడా ఫలితం లేకపోయింది గ్రామాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులను అడగగా మా యొక్క సొంత నిధులతో నడుపుతున్నాము అని వారు చెపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో ఏమి లేదు అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ గుండాల మండల కార్యదర్శి కొమరం శాంతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.