
మహా ముత్తారం నేటి ధాత్రి
అడవి జంతువుల వేటకు విద్యుత్ తీగలను మార్చే వ్యక్తులను వాటిని
ఉపయోగించే నిమ్మగూడెం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులను ఎమ్మార్వో ముందు అడవి ముత్తారం పోలీసులు బైండోవర్ చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఎస్సై దాసరి సుధాకర్ మాట్లాడుతూ అడవి జంతువులను వేటాడుటకు మరియు పంట పొలాల చుట్టూ రక్షణ కోసం విద్యుత్ తీగలను ఉపయోగించకూడదని పోలీసు వారు హెచ్చరించడమైనది ఎవరైనా ఆ విధంగా వాడుతున్నట్టు తెలిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఎలాంటి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఆ ప్రమాదానికి కారణకుడైన వారిపై రౌడీషీటు మోపడం జరుగుతుందని వారిపై హత్య నేరం మోపడం జరుగుతుందని హెచ్చరించడమైనది. తెలిపారు.