డీఎస్సీ టాపర్ మంగ నిఖిల్ కు ఘన సన్మానం

ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో మొదటి స్థానం సాధించిన మంగ నిఖిల్ ను ఘనంగా సన్మానించారు. సోమవారం హనుమకొండలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అండ్ కమ్యూనికేషన్ ట్రస్ట్ (టీజీ ఫ్యాక్ట్) ఆధ్వర్యంలో డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ తెలుగులో టాపర్ గా నిలిచిన నిఖిల్ ను ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ ఫ్యాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ హోమియోపతి డాక్టర్ పావుశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేటకు చెందిన మంగ నిఖిల్ ఉమ్మడి జిల్లాలో డీఎస్సీలో టాపర్ గా నిలవడం అభినందనీయం అన్నారు. టీజీ ఫ్యాక్ట్ అసోసియేషన్ కార్యదర్శి, ప్రభుత్వ టీచర్ మంగ రాజన్న కుమారుడు అఖిల్ చిన్ననాటి నుండే చదువులో ప్రతిభ చూపే వారని, గతంలో నిర్వహించిన బీఎడ్, పీజీ ఎంట్రెన్స్ లో ప్రతిభ చూపారని గుర్తు చేశారు. గౌరవ అధ్యక్షులు ఇజ్జగిరి అజయ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలుగులో ఒకే పోస్ట్ ఉండటం, అందులో నిఖిల్ టాప్ ర్యాంకు సాధించి పోస్ట్ దక్కించుకోవడం హర్షనీయమన్నారు. అలాగే మచిలీ బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ టీచర్ గా నియమితులు కావడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ ఫ్యాక్ట్ అసోసియేషన్ సెక్రటరీ మంగ రాజన్న, కోశాధికారి జల్లారపు రామస్వామి, సభ్యులు తుంగ సారయ్య, కంప రమేష్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, పసుల వెంకటస్వామి పావుశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!