
Invitation to Kantha Maheshwara Swamy Kalyanam
కంఠమహేశ్వరస్వామి కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో వచ్చే అక్టోబర్ 4, 5, 6,7 తేదీలలో నిర్వహించనున్న శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురమాంబ దేవి,శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్ని మహారాజ్ బోనాల పండుగ,కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు గాని గౌడ సంఘం కమిటీ బాధ్యులు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,సంఘం పెద్దలు సారయ్య గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్ ,తాళ్లపల్లి చంద్రమౌళి గౌడ్, తాళ్లపల్లి శ్రీను గౌడ్, గాధగోని సాంబయ్య గౌడ్, బొమ్మగాని కుమారస్వామి గౌడ్, గిరగాని చంద్రమౌళి గౌడ్,గండు లింగయ్య గౌడ్ ,గౌడ పెద్దలు పాల్గొన్నారు.