
Strict Action on Bribery in Indiramma Housing Scheme
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లంచం..అడిగిన కఠిన చర్యలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
https://youtu.be/tXgBWROWbyE?si=Zv7FQIG0lsYw3Vf
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లంచాలు అడుగుతున్న పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. లబ్ధిదారుల నుంచి బిల్లుల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులపై కాల్ సెంటర్ ద్వారా విచారణ జరిపి, ఇప్పటివరకు 10 మందిని సస్పెండ్ చేశారు. ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. లంచం అడిగితే 1800 599 5991 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు అందిన 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.