
Bhupalpalli Farmers to Receive Subsidies for Beekeeping
తేనెటీగల పెంపకం చేపట్టే రైతులకు ఉద్యాన శాఖ సబ్సిడీఎడ్ల సునీల్ కుమార్
జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి
భూపాలపల్లి నేటిధాత్రి
ఉద్యాన శాఖ ద్వారా తేనెటీగల పెంపకం చేసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద భూపాలపల్లి జిల్లాలో సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది అని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ సునీల్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనెటీగ పెట్టెలు
కొత్తగా ప్రారంభించే రైతులకు తేనెటీగ పెట్టెలు, ఉపకరణాలపై సబ్సిడీ
40% నుండి 60% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.పరికరాలు
హనీ ఎక్స్ట్రాక్టర్, ప్రొటెక్షన్ డ్రస్, స్మోకర్, హైవ్ టూల్స్ మొదలైన వాటిపై సబ్సిడీ.
ప్రాసెసింగ్ యూనిట్లు:
హనీ ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కూడా సబ్సిడీ ఉంటుంది.
తేనెటీగల పెంపకం చేయాలనుకునే రైతు/రైతు సమూహాలు పట్టా భూమి కలిగి ఉండాలి లేదా ఇతర పంటలతో కలిపి తేనెటీగలు పెట్టుకోవాలి.
దరఖాస్తు విధానం
ఆధార్, భూ పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్బుక్ కాపీ సమర్పించాలి.
తేనెటీగల పెంపకం చేపట్టిన రైతులు కానీ, భవిష్యత్తులో చేపట్టబోయే రైతులవి కలెక్టరేట్ లోని జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో, దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, అలాగే వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మరిన్ని వివరాలకు
భూపాలపల్లి డివిజన్ (రేగొండ, చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల, భూపాలపల్లి ఘనపూర్ మరియు గోరుకొత్తపల్లి) రైతులు 8977714064 కి, మహాదేవపూర్ డివిజన్ (మహదేవ్పూర్, మహ ముత్తారం, పలిమేల, కాటారం మల్హర్ రావు) రైతులు 8977714065 కి లేదా జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ సునీల్ కుమార్ (8977714063) పేర్కొన్నారు.