
"Congress Celebrates Telangana Liberation & Prajapalana Day in Chityala"
కాంగ్రస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం. ప్రజాపాలన దినోత్సవం.
చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం* మరియు ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా చిట్యాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి అనంతరం స్వీట్లు పంపిణీ చేసుకొని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిరుపతి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పరిపాలన నుంచి మొగలు సామ్రాజ్య వాదుల నుండి మన రాష్ట్రం విముక్తి చెంది ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మొగల్ సామ్రాజ్యవాదుల చేర నుండి విముక్తి అయిన రోజు సెప్టెంబర్ 17 ,గత పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి గత పది సంవత్సరాల నిరంకుశ పాలన నుండి విముక్తి చెందిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో సురక్షితంగా సుభిష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను 6 ఆరు గ్యారెంటీలను అమలుచేసి పేదలందరికీ అనేక సంక్షేమ పథకాలను అందించి ముఖ్య మంత్రి సుపరిపాలన అందిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి పార్టీ అభ్యర్థులందరినీ గెలిపెంచాలని అన్నారు,
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దొబ్బెట రమేష్ , చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ , రాష్ట్ర నాయకులు జ్యోతి రెడ్డి ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, చిట్యాల టౌన్ కమిటీ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ , మార్కెట్ డైరెక్టర్ మట్టికే రవీందర్, గుంటూరు పల్లి గ్రామ శాఖఅధ్యక్షులు నాగరాజు* , నాయకులు కొరిసాంబశివుడు, సరిగమల సదానందం, గుర్రపు నరసయ్య, క్యాత మార్కండేయ ,పిట్టల సాంబయ్య చిలుముల రాజమౌళి ,శనిగరపు మొగిలి ,దేవేందర్ రావు ,మేకల రాజయ్య, కట్కూరి సుమన్, మెరుగు సంపత్ తదితరులు పాల్గొన్నారు..