
Narsampet Goud Journalists Honor New Community Committee
గౌడ పట్టణ కమిటీని సన్మానించిన గౌడ జర్నలిస్టులు
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ గౌడ సంఘం నూతన కమిటీని నర్సంపేట గౌడ జర్నలిస్టులు సన్మానించారు.గౌడ పట్టణ కమిటీని ఇటీవల ఎన్నుకోగా పట్టణ గౌడ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్ ,ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ తో పాటు కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు,సంఘం అభివృద్ధి కోసం ప్రతీ ఒక్క గౌడబిడ్డ పాటుపడాలని కోరారు.నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుండి 7 వరకు కంఠమహేశ్వర స్వామి సూరమాంబదేవి,రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్ని బోనాల మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ఉత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వెంకటేశ్వర్లు గౌడ్ పిలుపునిచ్చారు.
గౌడ జర్నలిస్టులకు సన్మానం..
నర్సంపేట పట్టణ జర్నలిస్టులను నూతనంగా ఎన్నికైన నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘం ఉపాధ్యక్షుడు గాదగోని సాంబయ్య గౌడ్,ఆర్థిక కార్యదర్శులు నాతి సదానందం గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్,డైరెక్టర్లు తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్,మొగలగాని సురేష్ గౌడ్,వేముల కృష్ణ గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగెళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్,సంఘ సభ్యులు తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, తాబేటి లక్ష్మణ్ గౌడ్,కోల చరణ్ గౌడ్,జర్నలిస్టులు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,రడం శ్రీనివాస్ గౌడ్,బుర్ర వేణు గౌడ్, కందుల శ్రీనివాస్ గౌడ్,జూలూరి హరిప్రసాద్ గౌడ్,తడుక రమేష్ గౌడ్,వద్లకొండ పవిత్రన్ గౌడ్,వడ్లకొండ రాజ్ కుమార్ గౌడ్, కొయ్యడి సనత్ గౌడ్,గోపగాని శోభన్ గౌడ్,బండారి సుమంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.