
అవ్వల మురిపెం..చూసిన కళ్లకు సంబురం!
`ఒకే దగ్గర కృష్ణార్జునులను చూసి అవ్వల సంతోషం.
`మహిళల మద్దతు మరింత చిగురింతకు అవ్వలిచ్చిన చిరునవ్వుల వరం.
`గులాబీ దళానికి వున్న బలానికి ఈ సన్నివేశం నిదర్శనం.
`కేటీఆర్, హరీష్ లను చూడగానే చుట్టుముట్టిన అవ్వలు.
`కృష్ణార్జునులకు ఒకే శాలువలో సత్కారం.
`కేటీఆర్ ను దగ్గర తీసుకొని అవ్వలు పంచుకున్న ఆత్మీయతకు సాక్ష్యం.
`కృష్ణార్జునులను చూసిన ఆనందంలో అవ్వలు విరబూయించిన చిరునవ్వుల వనం.
`నాయకుల పట్ల ప్రజల్లో వున్న నమ్మకానికి సంకేతం.
`ప్రజల్లో ఎంతగా మమేకౌమౌతున్నారో చెప్పడానికి ఒక సందర్భం.
`కేసీఆర్ అంటే వున్న అభిమానానికి ప్రత్యక్ష నిదర్శనం.
`ఆ అభిమానం ఇద్దరు నేతల మీద కురిపిస్తున్న మహిళా లోకం.
`ఇలాంటి ప్రేమ నాయకులందరికీ సాధ్యం కాదు.
`ప్రజల్లో వున్న అంత గొప్ప ప్రేమను దూరం చేసుకోవద్దు.
`అరమరికలు లేకుండా కృష్ణార్జునులు కలిసి సాగాలని అవ్వలు ఇచ్చిన దీవెనలు.
`భవిష్యత్తు బీఆర్ఎస్ దే అని స్పష్టతనిచ్చిన అవ్వల అనురాగాలు.
`అందుకున్న ఇద్దరు కృష్ణార్జునులకు అవే ఆశీస్సులు.
హైదరాబాద్, నేటిధాత్రి:
మన నిత్య జీవితంలో కొన్ని సన్ని వేషాలు, సందర్భాలు ఎదురౌతుంటాయి. అవి కొన్ని సార్లు అబ్బురపరుస్తుంటాయి. ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఆనందాన్ని నింపుతాయి. సంతోషాన్ని అందిస్తాయి. అవి మనకే తారస పడనక్కర్లేదు. ఎదుటి వారికి జరుగుతున్నా మనం కూడా సంతోషిస్తుంటాం. ఆ క్షణం మనం కూడా కొంత ఆనందానికి లోనౌతుంటాం. అవి అనుభవించేవారికి ఎలా వుంటుంది? ఆ ఆనందానికి అవధులు వుండవు. అందుకు ఒక్క చిరునవ్వు చాలు. అక్కడ వాతావరణమంతా ఆహ్లాదకరంగా మారుతుంది. వారి జీవితంలోనే కాదు, చూసే వారి జీవితంలో కూడా ఒక గొప్ప అనుభూతి జీవితాంతం మిగిలిపోతుంది. మనసు పులకరించిపోతుంది. ఇలాంటి సందర్భాలు కొందరి జీవితాల్లో పదే పదే వస్తుంటాయి. కొందరి జీవితాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. అలా ఎప్పుడూ ఎదురయ్యే సన్నివేషాలలో పాత్రదారులైన వాళ్లు ఎంత అదృష్టవంతులో అని అనిపించక మానదు. అలాంటి అదృష్టాన్ని పదే పదే అందుకునే నాయకులు తెలంగాణలో ఇద్దరే ఇద్దరు వున్నారు. వాళ్లే కృష్ణార్జునులుగా పిలువబడే కేటిఆర్, హరీష్రావు. సహజంగా ప్రజలంటే మాకు ఎంతో ఇష్టమని ప్రతి నాయకుడు చెప్పేదే. కాని ఆ నాయకుడంటే మాకు ఎంతో ఇష్టమని ప్రజల చేత చెప్పించుకోవడం అంటే వారి మనసు ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. ఊరు, వాడ, ప్రాంతం, జిల్లా అని తేడా ఎక్కడ లేకుండా ఎక్కడికెళ్లితే అక్కడ ఆ నాయకుల పట్ల ప్రజలు ప్రేమ ఆదరణ చూపిస్తుంటే చూసే వాళ్లకు కూడా ఎంతో సంతోషంగా వుంటుంది. రాజకీయ ప్రత్యర్ధులకు సైతం ప్రజల నుంచి ఇలాంటి ప్రేమాభిమానాలు కేటిఆర్, హరీష్లకు దక్కడాన్ని చూసి సంతోషపడతారని చెప్పాలి. పైకి ఎన్ని రాజకీయ విమర్శలు చేసుకున్నా, ప్రత్యర్దులుగా ఎన్ని ఆరోపణలు గుప్పించుకున్నా నాయకులుగా ప్రజల్లో చెరగని ప్రేమను సొంతం చేసుకున్న నాయకులంటే తోటి నాయకులెవరైనా సరే ఆనందపడతారు. కేటిఆర్, హరీష్లకు ప్రజల్లోకి వెళ్లిన ప్రతిసారి ఇలాంటి సన్నివేషాలు తరుచూ జరుగుతూనే వుంటాయి. వారిని చూడగానే పల్లె అయినా, పట్నమైనా సరే ప్రజలు వారి వద్దకు చేరుకుంటారు. ఈ ఇద్దరు బాగున్నారా? అని ఆ ప్రజలను అడగకముందే బాగున్నారా! అయ్యా అంటూ అవ్వలు మూగిపోతారు. కేటిఆర్, హరీష్రావుల వద్దకు చేరుకుంటారు. వారిని చూసి ఏదో నాయకులు వచ్చారన్న భావన వారిలో వుండదు. తమ పిల్లలు వచ్చినంత సంతోషంగా ఈ ఇద్దరు నాయకులు ప్రజల్లోకి వెళ్లగానే బావిస్తారు. వారి వద్దకు చేరుకుంటారు. నవ్వుతూ, ముసిముసి నవ్వులు కురిపిస్తుంటారు. అలాంటిదే తాజాగా మరో సన్నివేషం జరిగింది. మాజీ మంత్రి హరీష్రావు ఇంటికి కేటిఆర్ వెళ్లారు. సహజంగా ఈ ఇద్దరు పార్టీ కార్యాక్రమాలు, పార్టీ వేదికలు, రాజకీయ సభల్లో నిత్యం కలుసుకుంటూనే వుంటుంటారు. నిత్యం ఫోన్లలో సంబాషించుకుంటూనే వుంటారు. ప్రత్యేకంగా ఒకరి ఇంటికి ఒకరు వెల్లడం అనేది సహజంగా కనిపించదు. ఈ మధ్య హరీష్రావు ఇంటికి కేటిఆర్ వెళ్లారు. ఆ విషయం తెలిసిన చుట్టుపక్కల అమ్మలకు, అక్కలకు, అవ్వలకు తెలిసింది. ఇద్దరు నాయకులు ఇంటి నుంచి బైటకు వెళ్లిపోయే ముందు ఆ అవ్వలంతా ఇద్దరిని చుట్టుముట్టారు. కేటిఆర్, హరీష్లను పేరు పేరునా పలకరించారు. కేటిఆర్ను చూడగానే మరింత అమితానందం పొందారు. ఎందుకంటే హరీష్రావు ఎప్పుడూ కనిపిస్తూనే వుంటారు. అక్కడికి వచ్చిన కేటిఆర్తో కలిసి హరీష్ను చూసే సరికి కృష్ణార్జులను ఒకే సారి ప్రత్యక్ష్యంగా చూడడంతో అక్కడ అవ్వలు సంతోషం వ్యక్తంచేశారు. కేటిఆర్కు కరచాలనం చేశారు. కేటిఆర్ను పట్టుకొని యోగక్షేమాలు అడిగారు. కేసిఆర్ ఆరోగ్యం ఎలా వుందని ఆరాతీశారు. అమ్మ ఎలా వుందని ప్రశ్నించారు. ఓ అవ్వ ఏకంగా కేటిఆర్ కడుపులో తల పెట్టి కేటిఆర్పై వున్న మమకారాన్ని చూపించింది. గదవ పట్టుకొని కేటిఆర్ను చిన్నపిల్లాడిలా ముద్దు చేసింది. ఆ నాయకుల పట్ల ప్రజలకు వున్న అభిమానానికి ఇవి సంకేతం. సహజంగా నాయకులు ఎదురు పడితే, ప్రజలు తమ సమస్యలు చెబుతారు. తమ సమస్యలు వివరిస్తారు. లేదా ప్రశ్నిస్తారు. వారి పాలనపై తమ అభిప్రాయాలను చెబుతారు. కాని ఇక్కడ అలాంటివి ఏమీ కనిపించలేదు. ఆ నాయకులను చూసిన ఆనందం చాలు అనుకున్నట్లు అవ్వలు మురిసిపోయారు. ఇలా ఇద్దరు నాయకుల పట్ల తెలంగాణ అక్కలు, అమ్మలు,చెల్లెండ్లు, అవ్వలు చూపించే ప్రేమలు మరే ఇతర నాయకులు దక్కినట్లు కూడా కనిపించవు. అవి కూడా బిఆర్ఎస్ నేతలకు మాత్రమే ఎదురౌతుంటాయి. బిఆర్ఎస్ అదికారంలోవున్నప్పుడు కేటిఆర్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటను వెళ్లారు. అక్కడ ఓ అరుగు మీద అవ్వలు కూర్చుకున్నారు. ఆ సమయంలో కేటిఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్లు పాదయాత్ర చేశారు. సరిగ్గా అవ్వలు కూర్చున్న చోటుకు కేటిఆర్ రాగానే ఎంతో మురిసిపోయారు. అయ్యా..అని పిలిచారు. దాంతో కేటిఆర్ వాళ్ల వద్దకు వెళ్లారు. వారితో కూర్చొని మాట్లాడారు. ఆ సమయంలో కేటిఆర్తోపాటు , అవ్వల మధ్య సంబాషణల్లో నవ్వులు విరబూశాయి. అంటే బిఆర్ఎస్ అధికారంలో వున్నప్పుడైనా, ఇప్పుడైనా ఈ నాయకుల పట్ల ప్రజల్లో ఒకటే భావన వుంది. ఇప్పుడంటే ప్రతిపక్షంలో వున్నారు. ఇప్పుడు సమస్యలు లేవనెత్తినా ఉపయోగం లేదు. కాని అధికారంలో వున్నప్పుడు సహజంగా నాయకులు తారసపడితే ఏదో సమస్యలు చెబుతారు. కాని అప్పుడు కూడా నీ కడుపు సల్లగుండ. అని అవ్వలు దీవించారే గాని, మాకు ఈ సమస్యలున్నాయని చెప్పలేదు. కేటిఆర్ దేవుడు. మాకు పించన్ ఇస్తున్నడు. అని దీవించారు. ఇంతకన్నా నాయకులు ఏం కోరుకుంటారు. ఇలాగే హరీష్రావు ఎక్కడికి వెళ్లినా సరే ప్రజలు గుమిగూడుతారు. ఆయనను తమ సొంత కొడుకులా పలకరిస్తారు. ప్రజలను హరీష్రావు ఎలా వున్నాడని అడకముందే సారు..బాగున్నర అని ఎదురొస్తారు. ఏమైన సమస్యలున్నాయా? అంటే మీరున్నంక మాకేం బాధ సారూ..అంటారే గాని, ఇది రాలేదు..అది రాలేదని చెప్పడం జరిగేది కాదు. ఇప్పుడు సాదారణ ఎమ్మెల్యేగా ప్రజల్లోకి వెళ్లినా అదే ప్రేమ , ఆదరణ ప్రజలు చూపిస్తారు. ఇప్పుడు కూడా మీరున్నంక మాకేంత తక్కువ అనేలాంటి పదాలే వాడుతారు. ప్రభుత్వం మారిన తర్వాత పరిస్ధితులను హరీష్కు వివరిస్తుంటారు. అందుకే హరీష్ ఏ ఊరికి వెళ్లినా ఓ అరుగు మీద కూర్చుంటారు. అందరూ అక్కడకు చేరుకుంటారు. అవ్వలంతా ఆయన చుట్టుముట్టి హరీష్నే యోగ క్షేమాలు తెలుసుకుంటారు. ఇలా బిఆర్ఎస్లో మరి కొంత మంది కూడా వున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇలాంటి సన్నివేషాలు చూస్తుంటారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆయన చుట్టూ చేరుతారు. పిల్లాజెల్లా అందరూ ఆయననుఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. నాయకుడు వచ్చాడన్న భయం వారిలో కనిపించదు. ఇక ఇటీవల కాలంలో ఎర్రబెల్లి తన నియోజకవర్గంలో పర్యటిస్తుంటే ఆయనను చుట్టుముట్టి ఎరువులు రావడం లేదని, వడ్లు కొనుగోలు చేయడం లేదని,నీళ్లు రావడం లేదని చెప్పే సందర్భాలు మీడియాలో చూస్తూనే వున్నాం.
మిమ్మల్ని ఓడిరచి తప్పుచేశినం అంటూ ఒక నాయకుడి వద్దకు వచ్చి ప్రజలు పొరపాటును వెళ్లడిరచడం కూడా చాలా అరుదు. అంతే కాదు నాయకుడి వద్ద ఎంత చనువు లేకపోతే ఓటు ఈసారి అటే ఏసిన అని చెప్పి, నాయకుడిని నవ్వించడం కూడా ఎక్కడ చూసి వుండరు. కాని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలు నేను ఓటు వేయలేదని చెప్పిన చిరునవ్వుతో వారితో కలిసిపోవడం అనేది అందరి వల్ల కాదు. తనకు ఓటు వేయలేదని ప్రజల మీద కోపం చూపించే నాయకులే వుంటారు. కాని వేయలేదని చెప్పే చనువు, నాకు తెలుసని నవ్వుతూ వారితో కలిసిపోయే నాయకులు వుండడం కూడా తెలంగాణ నాయకులు గొప్పదనం అని కూడా చెప్పాలి. ఇలా ప్రజాదరణ లభించడం అనేది వారి నిబద్దతకు, ప్రజా సేవకు నిదర్శనమని చెప్పడంలో సందేహం లేదు.