
"Sarkar Gandham Ritual at Shekhapur Dargah"
షేఖపూర్ దర్గాలో సర్కార్ గంధం సమర్పణ, భక్తుల కోలాహలం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలోని షేక్ షాబుద్దీన్ దర్గా వద్ద సోమవారం రాత్రి సర్కార్ గంధం సమర్పించారు. పోలీస్ పటేల్ వారి ఇంటి నుండి డప్పు చప్పులతో ఒంటపై గంధాన్ని దర్గాలో సమర్పించారు. మంగళవారం వరకు ఖవ్వాలి పోటీలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.
ఈ జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దర్గాను చందర్ పూలమాలలు సమర్పించి వచ్చిన భక్తులు మొక్కులు చెలించుకొని ఫేతెహ మిఠాయి సమర్పించి జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ప్రర్తించారు,