
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లంబాడి లపై అసత్య ప్రచారం చేస్తే సహించేదిలేదు
◆:- లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ పవర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ లో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి గోపాల్ పవర్ మాట్లాడుతూ బంజారా లంబాడిలు సింధు నాగరికత కాలం నుండే ఈ దేశ ములనివాసులు భారత దేశ స్వాతంత్రానికి ముందే గిరిజనులుగా గుర్తింపు పొందినము, 1871లో బ్రిటిష్ పాలకులు బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారు, 1931 లో నిజాం రాజులు చేపట్టిన కులగణన లో బంజారా లంబాడిలను గిరిజనుల పట్టికలో చూపించారు 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్టం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంతంలోని లంబాడిలు, సుగాలిలను భారత పార్లమెంట్ ఉభయశభల ఆమోదం తో ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్ ఆర్డర్ – 1956 ప్రకారం గిరిజనులుగా గుర్తింపు పొంది గిరిజన జాబితాలో సీరియల్ నెంబర్ 19 గా చేర్చాబడ్డారు అయితే ఒకే రాష్టంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన గిరిజన లంబాడిలను సుమారు 25 సమ త్సరాలు గిరిజన జాబితాలో చేర్చకపోవడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ లంబాడిలను ఘోరమైన అన్యాయం చేసింది అని అన్నారు,1969 కే చందా అధ్యక్షతన వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గారి నెత్రు త్వంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభ ల ఆమోదం తో ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ (సవరణ) యాక్ట్ 1976 (యాక్ట్ no 108 of1976)తేదీ :సెప్టెంబర్ 19, 1976 చట్టం చేసి తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడిలను గిరిజన జాబితాలో స
క్రమ సంఖ్య 29 గలో చేర్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ గారు గత శాసన సభ ఎన్నికల్లో లంబాడిల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ తాను గద్దెనెక్కనని అనేక సభలలో ప్రకటించారు. కానీ 2017 లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో హింసత్మక ఘటనకు పాల్పడిన సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లను కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చుకున్నారు. తేదీ 24/07/2025 నా వీరిద్దరూ లంబాడిలను గిరిజన జాబితా నుండి తొలగించాలని రిట్ ఫిటిషన్ దాఖాలు చేశారు.ఇది కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారమే జరిగిందా..? దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లంబాడిలకు సమాధానం చెప్పాలన్నారు. దీనిపై బి ఆర్ ఎస్, బీజేపీ ల వైఖరి కూడా ఎటువైపో..? సమాధానం చెప్పాలి అని అన్నారు ఈ కార్యక్రంలో జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు,