
Ganesh Pratishta Celebrated in Appajipalli
అప్పాజీపల్లి గ్రామంలో సగర సంఘం ఆధ్వర్యంలో గణేశ్ ప్రతిష్ట..
రామాయంపేట సెప్టెంబర్ 6 నేటి ధాత్రి (మెదక్)
సగర సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో గణేశుని ప్రతిష్టించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మండపానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శనమిచ్చారు. గణేశ్ వద్దకు వచ్చిన భక్తులకు సగర సంఘం గుర్తింపుగా ప్రత్యేక బహుమతులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ చైర్మన్ సంధిల సత్తయ్య సగర, జిల్లా అధ్యక్షులు సంధిల సాయిలు సగర, గ్రామ అధ్యక్షులు శంకురి సాయిలు సగర, ఉపాధ్యక్షులు రుక్కముల సంగయ్య సగర, మాజీ అధ్యక్షులు చెట్టుకింది సాయిలు సగర, మాజీ సర్పంచ్ మర్క రాములు సగర, సగర బంధువులు ఎల్లంపల్లి జగన్ సగర, చెట్టుకింది లక్ష్మయ్య సగర తదితరులు పాల్గొన్నారు.