
New TUWJ IJU Mandal executive committee
టీయూడబ్ల్యూజే ఐజేయూ మండల కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక
నిజాంపేట, నేటి ధాత్రి
మండల కేంద్రంలో మంగళవారం టియుడబ్ల్యూజే ఐజేయు మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా అజ్గర్, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జీడి చంద్రకాంత్ గౌడ్,కోశాధికారి బండారి సిద్ధ రాములు, ముఖ్య సహాయ కార్యదర్శిలుగా కుర్మ బాలరాజ్, ఊడెపుశ్రీకాంత్ ముఖ్య సలహాదారులుగా భైరవరెడ్డి ,భరత్ రెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జర్నలిస్టు సమస్యలపరిష్కారానికి కృషి చేస్తామన్నారు.