"Major Theft in Adarshanagar, Jahirabad"
ఆదర్శనగర్లో భారీ దొంగతనం..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో భారీ
చోరీ జరిగింది. ఆదర్శనగర్కు చెందిన శోభారాణి ఇంట్లో చొరబడ్డ దొంగలు బీరువా పగులగొట్టి రూ.2.50లక్షల విలువైన నగ నట్ర దొంగిలించారు. బైపాస్ సమీపంలో ఇంటికి తాళం వేసి ఉండటాన్ని పసిగట్టిన దొంగలు ఇంటి తాళం, బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 2 తులాల బంగారం, 4 తులాల వెండి, రూ.10 వేల నగదు చోరీ దొంగిలించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్ టీం అధికారులు ఫింగరింగ్ ప్రింట్స్ సేకరించగా జహీరాబాద్ పట్టణ ఎస్ఐ. వినయ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
