
Telangana Farmers Face Distress Amid Urea Shortage
యూరియా కోసం తెలంగాణ రైతులు ఎదురుచూపు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రైతు ఆవేదన పట్టించుకోవడం లేదు మహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మరియు బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాదినం శివప్రసాద్ కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ వజిర్ అలీ రైతు ఆవేదన తెలంగాణ రాష్ట్రంలో రైతు అకాల వర్షాలతో సతమతమవుతుంటే యూరియా ఎరువు దొరకక విలవిలలాడుతున్నారు అప్పులు చేసి పంట
సాగు చేస్తున్న రైతుకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందడం లేదు రైతు కన్నీళ్లు దేశానికి మంచిది కాదు రైతు పండిస్తేనే దేశానికి అన్నం దొరుకుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడి తెలంగాణ రైతులకు న్యాయం చేయాల్సిందిగా సకాలంలో ఎరువులు అందుకేనే పంటలు పండుతాయి లేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఎరువుల కొరత లేకుండా చూడాలి గత నెల రోజుల నుండి ఎండనక వాననక యూరియా కోసం తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్నారు తక్షణమే యూరియా సరఫరా చేయాలి రైతులకు యూరియా సరఫరా చేయాలి,