
Ganesh Puja by Leaders in Jahirabad
గణనాథుడి కృపా కటాక్షాలు ప్రజలపై సంపూర్ణంగా ఉండాలి
◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు
◆:- డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని అతిది హోటల్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు విఘ్నాలను తొలగించే దైవం ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజలపై సంతోషంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్పా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ సీనియర్ నాయకులు నారాయణ నర్సింహ గౌడ్ సురేష్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.