
మైలారం గుట్ట స్థలాన్ని అభివృద్ధి పేరుతో దగా
డి.ఎస్.పి భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం మైలారం గుట్టపై ఎడ్యుకేషన్ ,ఇండస్ట్రియల్ హబ్ కు 204/1, 205/1 సర్వే నెంబర్ల లో మొత్తం భూమి 187 ఎకరాలు ఉందని దాన్ని మొత్తం కేటాయిస్తున్నట్లు ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పారు .మేము అభివృద్ధిని స్వాగతిస్తాం. కానీ ఇంకా మొత్తం ఉన్న భూమి ఎంత పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయవలసి ఉంది .ఎందుకంటే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కుంటలు ,చెరువులు తెగిపోతే మొరంచే పల్లెకు, ధర్మరావుపేటకు, గణపురం కట్టకు ,గణపురం బతుకమ్మ స్థలానికి .ప్రతి చోటుకు వందల లారీల మట్టి తరలించారు. ఇది ఎమ్మెల్యేకు ప్రజలందరికీ తెలుసు కానీ ఈరోజు ప్రభుత్వ భూమి లేకుండా అభివృద్ధి ముసుగులో భూమి అన్యక్రాంతం చేస్తే ముందు తరాల వారికి మట్టి కూడా దొరకదు. ఇల్లు కట్టుకుంటే ఇటుక ,సిమెంటు కొన్నట్టుగా మట్టి కూడా కొనవలసి వస్తుంది. గండ్ర వెంకటరమణ రెడ్డి తీసుకున్న ఆయిల్ మిల్లు పర్మిషన్ రద్దుచేసి నేడు జి ఎస్ ఆర్ అధికారంలోకి రాగానే ఈ భూమిని కాపాడి మైలారం ప్రజలకు, విలేకర్లకు ఇంటిస్థలాలు, కుల సంఘలా గుల్లకి , నిరుపేదలకి ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారు. మొత్తం గుట్ట చుట్టూ బాటలు తీసి మైలారం ,గాంధీనగర్ ప్రజల నోట్లో మట్టి కొట్టారు ప్రభుత్వ స్థలం అంటే ప్రజలందరి ది .ఏకపక్ష నిర్ణయాలు మంచివి కావు .50 ఎకరాల భూమిని తరతరాలకు శాశ్వతంగా కేటాయించాలి .భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని మీరు యాత్ర చేయడం జరిగింది .మీరు చేసిన యాత్ర నిజమే అయితే భారత రాజ్యాంగ స్తంభ చిహ్నం కట్టుకోవడానికి ఒక ఎకరం స్థలాన్ని కేటాయించండి. భూమి దుర్వినియోగం కాకుండా కాపాడుతామని చెప్పడం ఈ భూమిని శాశ్వతంగా మనకు దూరం చేయడమే అని ప్రజలు గమనించాలి. విలేకర్లకు ఇంటిస్తాలాలు, కుల సంఘాలకు గుడి స్థలాలు, పేదవారికి ఇంటి స్థలాలు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకోలు చేసి ఈ భూమిని కాపాడుకుంటామని హెచ్చరిస్తున్నాం.