
BRS Holds Village Preparatory Meeting in Mallakkapet
మల్లక్కపేట గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశం
పరకాల నేటిధాత్రి
స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి అన్నారు.సోమవారం బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశం మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మల్లక్కపేట గ్రామంలో బిఆర్ఎస్ సమన్వయ కమిటీ నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ప్రజలలో బిఆర్ఎస్ కున్న అభిమానాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి మనలో మనకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకొని అతడికి ప్రతి ఒక్కరం సహకరించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల పిఎసిఎస్ చైర్మన్ నాగయ్య,సమన్వయ కమిటీ సభ్యులు ఆముదలపెల్లి అశోక్,కోరే రమేష్,మండల యూత్ అధ్యక్షులు శాతరాశి సనత్ పటేల్,గ్రామ నాయకులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.