
Indiramma House Construction Reviewed in Mogudampalli
మొగుడంపల్లి: ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన
జహీరాబాద్ నేటి ధాత్రి:
మొగుడంపల్లి మండలం జాంగార్ బోలీతండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చలపతిరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడి, మంజూరైన ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే పూర్తి చేసుకున్న పనులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేశ్, పంచాయతీ కార్య దర్శి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.