
సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక చేయూత…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణపూర్ పట్టణంలోని మల్లికార్జున నగర్ కి చెందిన సంధవేణి నాగమణి కి ఒక్కసారిగా హై బిపి వచ్చి, మెదడులో నరం తెగి రక్తం గడ్డ కట్టడంతో వారు, కరీంనగర్ లోని కెల్విన్ హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వారు సిరి ఫౌండేషన్ ను సంప్రదించగా వారు దాతల ద్వారా సేకరించిన 12,150 రూపాయలను సిరి ఫౌండేషన్ సభ్యులు వారి ఇంటికి వెళ్లి నాగమణి కుమారుడు సంతోష్ కు అందజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉండి సహాయం కోసం ఎదురు చూసే, ప్రతి ఒక్కరికి సిరి ఫౌండేషన్ అండగా నిలుస్తుంది అని అన్నారు, నేటి యువత సేవా కార్యక్రమలలో ముందుడాలని నాగమణి గారి చికిత్స కోసం విరాళాలు అంధిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిరి ఫౌండేషన్ కార్య వర్గ సభ్యులు ఉప్పు శేఖర్, సంతోష్ కుమార్,స్థానిక నాయకులు అర్నె సతీష్, జీలకర మహేష్, సుధాకర్ పాల్గొన్నారు.