
గణేష్ మండపాల పర్మిషన్ కోసం ఇలా అప్లై చేసుకోండి
జహీరాబాద్ నేటి ధాత్రి:
గణేష్ నవరాత్రులకు మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు సూచించారు https://policeportal.tspolice .gov.in/index.htmలో పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి. “విద్యుత్ కనెక్షన్ కోసం డిడి కట్టాలి. సొంతంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వొద్దు. నిపుణులతో మాత్రమే పనిచేయించండి. గాలి,వానను తట్టుకునేలా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసుకోండి” అని పోలీసులు తెలిపారు.