
Bhoomi Puja
భద్రకాళి పరపతి సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ
జనగామ, వరంగల్ నేటిధాత్రి.
వరంగల్ కాశిబుగ్గ శ్రీ భద్రకాళి పరపతి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జనగామలో తొమ్మిది ఎకరాల స్థలానికి భూమిపూజ నిర్వహించారు. సంఘ అధ్యక్షులు గుళ్ళపల్లి రాజ్కుమార్ (బాంబుల కుమార్) కార్యవర్గ సభ్యుల సహకారంతో ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, సభ్యులందరికీ కుడా లేఔట్ రూపకల్పన చేసి ప్రతీ ఒక్కరికీ ప్లాట్లు కేటాయించాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ వర్తక సంఘం అధ్యక్షులు గుండేటి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి, యునైటెడ్ కార్పొరేషన్ అధ్యక్షులు, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్, గౌరవ సలహాదారులు ధూపం సంపత్, వివేకానంద యోగ పరపతి సంఘం అధ్యక్షులు కూరపాటి సుదర్శన్, లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం అధ్యక్షులు వంగరి ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే భద్రకాళి పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి గోగికార్ కిరణ్, కోశాధికారి మాటేటి విద్యాసాగర్, ఉపాధ్యక్షులు గోరంట్ల మనోహర్, సల్లా రాజేందర్, సిద్ధోజు శ్రీనివాస్, ఇప్పలపల్లి శివాజీ, కోయల్ కార్ నందకిషోర్, గుర్రపు సత్యనారాయణ, గుత్తికొండ నవీన్, గుళ్ళపల్లి సాంబశివుడు, వంగరి రవి, వెంగళ లక్ష్మణ్, సిందం చంద్రశేఖర్, రామ యాదగిరి, పోత్కనూరి రాజు, ములుక సురేష్, బండారి శ్రీనివాస్ తదితర కమిటీ సభ్యులు, పలు సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. సభ్యులందరికీ ఆర్థిక సహాయం సంకల్పంతో ఈ భూసేకరణ చేసి, శాశ్వత నివాస వసతి కల్పించడమే సంఘ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.