
Congress party
ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు..
కేసముద్రం/ నేటి ధాత్రి
దేశ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ అనుసరించిన బాటలో పయనించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుండాలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు
నవ భారత నిర్మాత మాజీ ప్రధాని, భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం కేసముద్రం మండల కేంద్రంలో గాంధీ సెంటర్ నందు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు మహబూబాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి పిసిసి మెంబర్ దశ్రు నాయక్
ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశంలో ప్రవేశపెట్టి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పన, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించారని అన్నారు. అలాగే గ్రామపంచాయతీలకు నేరుగా కేంద్రం నుండి నిధులను పంపిణీ చేసి గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. రాజీవ్ గాంధీ యువతకు ఐకాన్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను పునికి పుచ్చుకున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముందున్న కర్తవ్యం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ ఎండీ ఆయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి, నాయకులు దామరకొండ ప్రవీణ్,వేముల శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ వెంకన్న,గ్రామ పార్టీ అధ్యక్షులు పోలేపల్లి వెంకట్ రెడ్డి,భెలియ, భూలోక్ రెడ్డి,పోకల శ్రీనివాస్, తరాల సుధాకర్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్, ఎండీ రషీద్ ఖాన్, ఎండీ నవాజ్ అహ్మద్, మాజీ ఉప సర్పంచ్ రఫీ, మాజీ వార్డు మెంబర్ బాలు నాయక్,సాంబయ్య,అల్లం నిరంజన్,కనుకుల రాంబాబు,నయీం,తోట అఖిల్, ముజ్జు షేక్,కాట్రేవుల హరికృష్ణ, ఎండీ సమీర్, ఎండీ అలీమ్, కొల్లూరి శ్రీనివాస్,వెలిశాల కమల్,బాల్మోహన్, బాధ్య నాయక్,సుందర్ వెంకన్న,శ్రీను,కళాధర్,సముద్రాలమహేష్, బోడా విక్కి,కాట్రేవుల సతీష్,రాజేష్,పరకాల కుమార్, ఆగే చిన్న వెంకన్న,నూరోద్దీన్,విజేందర్ రెడ్డి, కార్యకర్తలు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.