
Rajiv Gandhi 81st Birth Anniversary Celebrations
దేశ రాజకీయ చరిత్రలో ధ్రువతార. . *రాజీవ్ గాంధీ 81వజన్మదిన వేడుకలు
జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు
మొగులపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కలపల్లి రాజు మండల కేంద్రం లోని చౌరస్తా వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఆయన 1944 ఆగస్టు 20వ తేదీన బాంబేలో జన్మించారు భారతదేశం స్వాతంత్రం సాధించే నాటికి ఆయన తాత ప్రధాన మంత్రి అయినప్పటికీ రాజీవ్ గాంధీ వయసు కేవలం మూడు సంవత్సరాలు అలాంటి వ్యక్తి భారతదేశానికి ఏడవ ప్రధానమంత్రి అతను 1984 నుండి 1989 వరకు ప్రధానమంత్రిగా వ్యవహరించారు ఆయన ప్రధానమంత్రి గా పనిచేశారు అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.అలాగే చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మమ్మదు రఫీ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆపద వస్తే నేనున్నానని 108 లాగా ముందుండి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారి ఆదేశాల మేరకు ఇందిరా గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ గాంధీ కుటుంబం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు ఎంతో మేలు చేసిందని అందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆ రాజ్యంలో పేదలకు న్యాయం జరుగుతుందని వారి పేర్ల మీద నిరుపేదలైనటువంటి వారికి పథకాలను ప్రవేశపెట్టి అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అలాగే 500 కే గ్యాస్ సిలిండర్ పేదలకు ఉచిత సన్న బియ్యం కార్డు లేని నిరుపేదలకు రేషన్ కార్డు లు ఇస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదలను అభివృద్ధి పథకంలో నడిపిస్తూ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రము ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు . కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ ,మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.