
"Rainwater Trouble in School"
పాఠశాల ఆవరణలో వర్షపు నీరు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం పంచాయతీ పరిధిలోని గ్రామ ప్రాథమిక పాఠశాలలో వర్షాలకు వర్షపు నీరు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ నిలిచిన నీటిలో క్రిమికీటకాలు పెరిగి దుర్గంధం వెదజల్లుతోంది.
మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి పడిన వర్షనికీ పాఠశాలలో ఆవరణలో చేరిన వర్షపు నీరు.విద్యార్థులు పాఠశాల గదులకు వెళ్ళటానికి,పాఠశాల నుండి బయటకు వెళ్లడానికి విద్యార్థిలకు ఇబ్బంది కలుగుతుందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలో మన ఊరి మనబడి లో ఎన్నో నిధులతో పనులు చేశారు.పాఠశాల ఆవరణలో మట్టి వేసి ఎత్తుగా చేయడం లేదు,
కానీ ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని విద్యార్థి తల్లిదండ్రులు చింతిస్తున్నారు.ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ సమస్య ను పరిష్కరించాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు.