
Free School Bags Distributed in Edakulapalli
ఏడాకులపల్లి గ్రామంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రెస్టీజ్ వెంచర్ యజమాని సత్యనారాయణ ఝరాసంగం మండల గ్రామం ఏడాకులపల్లి ఎంపియుపిఎస్ పాఠశాల విద్యార్థులకు ఉచిత స్కూల్ బాగ్స్ పంపిణి చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొప్పోజు శ్రీనివాస్,గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి, సంగారెడ్డి మరియు వీరన్న పాల్గొనడం జరిగింది.మరియు పాఠశాల ఉపాధ్యాయులు రజిత రేణుక పాఠశాల చైర్మన్ కల్పన ఈ కార్యక్రమంలో పాల్గొని కృతజ్ఞతలు తెలపడం జరిగింది.