
"Gudikandula Ramesh Condemns 'Marwadi Go Back'"
మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని ఖండించిన గుడికందుల రమేశ్
మందమర్రి నేటి ధాత్రి
మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని సామాజిక ఉద్యమకారుడు గుడికందుల రమేశ్ తీవ్రంగా ఖండించారు. సోమవారం మందమర్రిలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశ పౌరులందరికీ ఏ ప్రాతంలోనైన వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. గో బ్యాక్ నినాదం వెనుక ఎదో కుట్ర ఉంటుదని, కాబట్టి ప్రజలు, యువకులు, విద్యార్థులు భాగస్వాములై నష్టపోవద్దని సూచించారు. తెలుగాణ ప్రాంతం గంగా, జమున, తెహజీబ్ కు ప్రతీక అన్నారు. ఇక్కడ కులం, మతం, ప్రాంతం అనే వైరుధ్యాలు, వైషమ్యాలు లేవన్నారు. ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకొని ఆదిరించిన గొప్ప సరస్కతి, చరిత్ర కలిగిన నేల తెలంగాణ అన్నారు….