
Malahal Rao’s Road Repair Initiative...
మానవత్వం చాటుకున్నా మలహాల్ రావు
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు లో భాగంగా నడికూడ నుండి ధర్మారం వెళ్లే రోడ్డు ఒకవైపు రోడ్డు పూర్తయి ఇంకోవైపు రోడ్డు పూర్తి కాలేదు,వర్షపు నీరు మురికి నీళ్లు పోవడానికి కూడా కాలువలు లేవు, రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీళ్లు ఎటు పోకుండా ఒక వైపు రోడ్డు మధ్యలో గుంటలాగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా ఉంది ద్విచక్ర వాహనాల మీద వెళ్లే వారు నీళ్లలో గుంటలు ఏర్పడక చాలామంది ప్రమాదానికి గురవుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న నడికూడ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్లమలహాల్ రావు ట్రాక్టర్లతో మట్టి (మొరం) తెప్పించి నేర్పించి చదునుచేపించి ప్రమాదాలు జరగకుండా చొరవ తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బిక్షపతి, గ్రామపంచాయసిబ్బంది కిన్నెర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.