
ప్రజల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన యోధుడు
స్వరాష్టం కోసం ప్రజలు కన్నా కలలను నిజం చేసిన మహనీయుడు
బి ఆర్ ఎస్ మాజీ ఎంపీటీసీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి
ముత్తారం :- నేటిధాత్రి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించి,తన జీవితాన్నే త్యాగం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ముత్తారం లో ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాజీ ఎంపీటీసీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత జయశంకర్ ను రాష్ట్ర ప్రజలు ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారు కోట్లాది మంది ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపి ప్రజలను రగిలించారు ప్రత్యేక రాష్ట్ర సాధనలో కేసిఆర్ తో కలిసి అయన చేసిన సూచనలు సలహాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకాలు అని అన్నారు తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషిచేసారు యావత్ జీవితాన్ని ఉద్యమానికి దారపోశారాణి అన్నారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ లు జక్కుల ముత్తయ్య అత్తె చంద్ర మౌళి వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు మాజీ సర్పంచ్ నూనే కుమార్ పి ఏ సి ఎస్ మాజీ చైర్మన్ గుజ్జుల రాజి రెడ్డి బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు