
ECG technician's negligence
ఈసీజీ టెక్నీషియన్ నిర్లక్ష్యంపై రోగుల ఆందోళన.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈసీజీ టెక్నీషియన్ నిర్లక్ష్యంపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వందలాది మంది రోగులు వచ్చే ఈ ఆసుపత్రిలో, అత్యవసర రోగులకు ఈసీజీ తీయాల్సిన టెక్నీషియన్ ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారు. ఆయన లేని రోజుల్లో ట్రైనింగ్ నర్సులు, పేషెంట్ కేర్ సిబ్బందితో ఈసీజీలు తీయిస్తున్నారని, దీనిపై అధికారులు పట్టించుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.