
అసత్య ఆరోపణలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు మండల కేంద్రంలో కస్తూరిబా హాస్టల్ తనిఖీ చేసి సౌకర్యాలు లేవనడం సిగ్గుచేటని గత పది సంవత్సరాల కాలంలో హాస్టలను పట్టించుకోలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు, గత పది సంవత్సరాల కాలంలో హాస్టల్ పిల్లలు దొడ్డన్నతో తింటే ఒక్కరోజు వచ్చి చూడలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు సన్న బియ్యం తింటుంటే ఓ ర్చుకోలేక గండ్ర సత్తెన్న పై ఆరోపణ చేస్తున్నారని అన్నారు, ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే తన చిల్లర రాజకీయాలు చేయొద్దని అలాగే గత పాలకుల కాలంలో కస్తూర్బా స్కూలు వర్షంతో తడిసి ఉరుస్తుంటే పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే సత్తన్న ఎమ్మెల్యే గెలిచినాక 20 లక్షల తో అభివృద్ధి పనులు చేసి పిల్లలకు సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు దీని జీర్ణించుకోలేక హాస్టల్ల సందర్శన పేరుతో వంటలు బాగా లేవనడం సౌకర్యాలు లేవనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు, స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య రాష్ట్ర నాయకులు దబ్బేట రమేష్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమారు గుంటూరు పల్లె గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దున నాగరాజు కాంగ్రెస్ నాయకులు బుర్ర శ్రీనివాసు, మార్కండేయ, రాజమౌళి, గుమ్మడి సత్యనారాయణ, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.