
Farewell to APM
మండల సమైక్య ఆధ్వర్యంలో ఏపీఎం కు వీడ్కోలు..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం లో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న మెండి లతామంగేశ్వరి 8 సంవత్సరాలుగా ఓదెల ఏపిఎం గా బాధ్యతలు చేపట్టి ఈ రోజు బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఏపీఏంగా బదిలీపై వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండలంలోని గ్రామ సమైక్యల అధ్యక్షులు గ్రామ సంఘం అసిస్టెంట్లు మరియు సిబ్బంది అందరూ ఏపియం ని శాలువాలతో సన్మానించి వీడ్కోలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సురేంద్ర, రాము, సీసీలు మారెళ్ళ శ్రీనివాస్, మల్లయ్య, కొమురయ్య, విజయ రాజకుమారి, స్త్రీనిధి మేనేజర్ ప్రభాకర్ ,పవన్, భవాని, రమేష్, రాము మండల సమైక్య పాలకవర్గ సభ్యులు ఆలేటి స్వప్న రెడ్డి , పి.అనూష, జెఅనూష మరియు విఓ అధ్యక్షురాల్లు, వివోఏ లు పాల్గొనడం జరిగింది.