
In-charge Agriculture Officer Ajmira Srinivas Rao.
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు…
నేటి ధాత్రి -గార్ల :-
ఎరువులు అధిక ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకొంటామని ఎంతటి వారైనా ఉపేక్షించ బోమని మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ వ్యవసాయ అధికారి అజ్మీరా శ్రీనివాస్ రావు ఎరువుల డీలర్లను ను హెచ్చరించారు.శుక్రవారం గార్ల మండల పరిధిలోని పుల్లూరు మరియు గార్ల లో పలు ఎరువుల దుకాణం లను మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు తో కలిసి తనిఖీ చేపట్టారు.స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్,ఇన్వాయిస్ లు, ఈపాస్ మెషిన్స్ క్షుణ్ణంగా పరిశీలించినారు.రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎరువులను సాఫీగా పంపిణీ చేయాలని డీలర్స్ ను కోరారు.ఎరువులు జిల్లా లో సరిపడా అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మోతదు కు మించి రసాయన ఎరువులు వాడవద్దని రైతులకు సూచించారు.ఎరువులు అమ్మకం లో అక్రమాలకు పాల్పడితే సంబందించిన ఎరువుల లైసెన్స్ రద్దు చేస్తామని హేచ్చరించినారు.