
Principal Swaroopa.
జిల్లాస్థాయి పద్యపఠన పోటీలకు లేఖన ఎంపిక
అభినందించిన ప్రధానోపాధ్యాయులు స్వరూప.
నర్సంపేట,నేటిధాత్రి:
దాశరథి కృష్ణమచార్యా శత జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా స్థాయి పద్యపఠన పోటీలకు నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో గల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థిని ఇజ్జగిరి లేఖన ఎంపికయ్యింది.ఈసందర్భంగా విద్యార్థిని ఇజ్జగిరి లేఖనను పాఠశాలల
ప్రధానోపాధ్యాయులు స్వరూప అభినందించారు. హెచ్ఎం మాట్లాడుతూ నర్సంపేట మండలంలో మొత్తం 54 మంది విద్యార్థులు పాల్గొనగా కేవలం 4 విద్యార్థులు ఎంపిక అయ్యారన్నారు.అందులో భాగంగా తమ పాఠశాల విద్యార్థిని లేఖన ఎంపిక అయ్యిందని పేర్కొన్నారు.లేఖన ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణం అని ప్రధానోపాధ్యాయులు స్వరూప ఆనందం వెళ్లుబుచ్చారు. అనంతరం లేఖనను సన్మానించి ప్రధానోపాద్యాయురాలు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.