
District Agriculture Officer Ganga Jamuna.
నానో ఎరువులతో లాభాలేన్నో
రైతులకు నానో ఎరువులపై అవగాహన కార్యక్రమం
మండల వ్యవసాయ అధికారి గంగా జమున
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో నానో యూరియా,నానో డిఏపి వాడేలా రైతులను ప్రోత్సహిం చాలని మండల వ్యవసాయ అధికారి గంగా జమున ఆధ్వ ర్యంలో రైతులకు నానో ఎరు వులపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవో మాట్లాడుతూ నానో యూరియా, నానో డిఎపి వాడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదకత నాణ్యత పెరుగుతుంది పంటలకు పర్యావరణ ఒత్తిడి తెగుళ్లను తట్టుకునే శక్తిని అందిస్తాయని అన్నారు అంతే కాకుండా పర్యావరణహితంగా పనిచేస్తాయని పేర్కొన్నారు నెలల ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా గాలి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తాయని వివరించారు. సంప్రదాయక ఎరువులకు బదులుగా నానో యూరియా నానో డిఏపి ఎరువులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వాటి వినియోగం గురించి రైతులకు తెలియ జేయడం జరిగింది ఈ కార్యక్ర మంలో, ప్రగతిసింగారo గ్రామం లోని రైతులు, డీలర్లులు, ప్రజలు పాల్గొన్నారు.