
Wine Shop.
వైన్ షాపులో చోరీకి పాల్పడ్డ వ్యక్తులు అరెస్ట్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని తిరుమల వైన్ షాప్ లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాలుపడ్డారని షాప్ యజమాని ఫిర్యాదు చేయగా ఎస్ఐ వి గోవర్ధన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో నల్లబెల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి పోలీసులను చూసి పారిపోతుండగా వారిని పట్టుకుని విచారించగా బొడిగే ప్రశాంత్ (21), ఎల్ల బోయిన సాయి కుమార్ (20) లను మండల కేంద్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తించడం జరిగిందని అనంతరం సదరు వ్యక్తులను ఎక్కడికి వెళ్తున్నారని విచారించగా వరంగల్ కు వెళ్తున్నామని అనుమానంగా సమాధానం చెప్పడంతో. పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా సోమవారం అర్ధరాత్రి సమయంలో తిరుమల వైన్స్ షాప్ లో వెనుక భాగాన వెంటిలేటర్ ను పగలగొట్టి షాపులోకి దూరి క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బులు దొంగలించి వరంగల్ కు వెళ్తున్నామని నిందితులు అంగీకరించగా. నిందితులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 19800 రూపాయలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించి నైనది అని ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ఆయన వెంట సిబ్బంది సాయిలు, వేణు తదితరులు ఉన్నారు.