
Teenmar Mallanna
తీన్మార్ మల్లన్నను పరామర్శించిన జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఈనెల 12 వ తేదీన తీన్మార్ మల్లన్న గారు మన ప్రాంతానికి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే, ఆ సభలో కల్వకుంట్ల కవిత గారి గురించి మాట్లాడారని, 13వ తేదీన తీన్మార్ మల్లన్న కార్యాలయం పై జాగృతి కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. దాడి జరిగినందుకు యావత్తు తెలంగాణ బీసీ నాయకులు మరియు తీన్మార్ మల్లన్న టీమ్ మెంబర్స్ అందరు కూడా కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మని తగలబెట్టడం జరిగింది. ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిలో తీన్మార్ మల్లన్న గారి చేతికి గాయాలవ్వడం జరిగింది, కావున, ఈరోజు హైదరాబాద్ లో వారి కార్యాలయంలో జ్యోతి పండాల్ మరియు పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు కలిసి తీన్మార్ మల్లన్నను పరామర్శించడం జరిగింది.