
Congress
సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం ఇందారం గ్రామం లోని దొరగారి పల్లె ప్రాంతంలో గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో ఇందిరమ్మ ఇంటికి శనివారం ముగ్గు పోసే కార్యక్రమం చేపట్టడం జరిగింది.అలాగే గ్రామం లో ప్రతి పేదవారికి ఇండ్లు మంజూరు అయ్యేలా మంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు.గతా పది సంవత్సరాల పాలనలో అందరిని కెసిఆర్ మోసం చేశారని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కు కట్టుబడి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి వివేక్ వెంకటస్వామికి,యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.చెన్నూరు నియోజకవర్గంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజుద్దీన్,సిహెచ్.సతీష్ కుర్మిల్లా సరస్వతి,రవి, భాగ్యరాజ్,గ్రామం పెద్దలు పాల్గొన్నారు.