ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ర్యాలీ.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూకాంటాక్ట్ కార్మికుల కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి అని,కార్మికులను బానిస తత్వంలోకి నెట్టే 4 లేబర్ రద్దు చేయాలిఅని,కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదు అని ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు, ఈ ర్యాలీలో ఆశ వర్కర్లు రైతు కూలీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
