
కాట్రపల్లి గ్రామానికి క్వారీ గడ్డం…
వారిని మూసేయాలని కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసిన యువకుడు
కేసముద్రం/ నేటి ధాత్రి
మహబూబాబాద్. కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి.. సోమవారం ప్రజావాణిలో డిస్టిక్ కలెక్టరేట్ జిల్లా అధికారులతో సహా స్థానిక స్థానిక ఎమ్మార్వో ఆర్డీవో జిల్లా పంచాయతీ శాఖ అధికారుల అందరికీ ఫిర్యాదు చేయడం జరిగిందని కాట్రపల్లి గ్రామానికి చెందిన నల్లగొప్పుల హరీష్ తెలిపారు..ఫిర్యాదు గల కారణాలు: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సాయి బాలాజీ గ్రానైట్ వారు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ రాత్రి సమయంలో సైతం బాంబుల మూతతో గ్రామాన్ని దద్దరిల్లేలా చేస్తున్నారు తెలిపారు.దీనివల్ల గ్రామానికి ఆనుకొని ఉన్న ఈ ఈ క్వారీ నుండి భారీ శబ్దాలు మరియు భూమి కంపించడం వల్ల అనేక ఇండ్లకు గోడలు బీటలు వారాయి గుండె సంబంధిత రోగులు చిన్న పిల్లల వృద్ధులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు.ఇంకా రోడ్ల పరిస్థితి మరి అద్వానంగా మారాయని క్వారీ నుండి పెద్ద పెద్ద పండరాళ్లతో అధిక లోడుతో వెళ్తున్న ఈ లారీల వల్ల అనేక ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగిన సంఘటనలు ఉన్నాయని, రోడ్లు గుంతల మయమై వాహనదారులు అనేక ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి నెలకొంటున్నాయని, ఈ క్వారీ నుంచి వచ్చే కలుషిత నీరు బాంబుల రసాయనాల వల్ల వచ్చే కలుషిత విషపూరితమైన నీరు పక్కనే ఉన్న ప్రవహించే ఏరు వాగు నీటిని పంట పొలాలకు నిరంతంచే నీరు కలుషితమై చేపలు మరియు ఇతర మూగజీవాలు ప్రాణాలు వదులుతున్నాయి అని దయచేసి సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఈ గ్రానైట్ క్వారీని వెంటనే మూసివేయాలని సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.