
స్థానిక ఎన్నికలకు సన్నాహాలు…స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం…..!!!!
◆:- పంచాయతీ ఎన్నికల నిర్వహణ
◆:-గుర్తులు సిద్ధం ఎటూ తేల్చని ప్రభుత్వం
◆:-రిజర్వేషన్లపై సందిగ్ధం
◆:-మూడు నెలల్లో స్థానిక సమరం
◆:-సెప్టెంబరు 30లోగా నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
◆:-ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం
◆:-పాలకవర్గాలు లేకపోవడంతో గాడితప్పిన స్థానిక పాలన
◆:-ఎన్నికలు వస్తే సత్తా చాటేందుకు నాయకుల తహతహ
◆:-పంచాయతీలతో పాటే పరిషత్లకూ ఎన్నికలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
స్థానిక ఎన్ని కలకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తు న్నది. మరో రెండు నెలల్లో పంచాయతీ ఎన్ని కలు జరుగుతాయనే ప్రచారం జరుగుతున్న వేళ జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణ కోసం. సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 4692 గ్రామ పంచాయతీలు, 1220 వార్డులకు ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 524,471 మంది ఓటర్లు ఈ పంచాయితీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు విని యోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాను. న్నారు. ఇందులో పురుష ఓటర్లు 2,52,319 మంది మహిళా ఓటర్లు 2,72143 మంది ఉన్నారు. తొమ్మిది మంది ఇతరులు కూడా ఓట రుగా నమోదు చేసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్ధులకు కేటాయించే గుర్తులను సిద్ధం చేసింది. 5వేల మంది పోలింగ్ సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు.
రిజర్వేషన్లు తేలితేనే!
రిజర్వేషన్ల లెక్కలు తేలితేనే పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది. అన్ని వర్గాలకు జరాభా నిష్పత్తి ప్రకారం స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. గత ఎన్నికల సమయంలో వెల్లడించిన రిజర్వేషన్ల
ఈసారి కూడా అమలులో ఉంటాయని అప్పట్లో పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం మారడంతో పాత విధానాన్ని కొనసాగిస్తారా? నూతన రిజర్వేషన్లు అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉన్నది. రిజర్వే షన్లు ఖరారు అయిన తర్వాతనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. జనాభా గణాంకాల ఆధారంగానే పంపిణీ జరగనుంది.
వెంటాడుతున్న ‘జమిలి’ భయం
జమిలీ ఎన్నికల చర్చ సాగుతున్న వేళ.. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపైనా పడు తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిం చాలనేది జమిలీ ఎన్నికల ప్రధాన లక్ష్యం 90 రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు వెళ్తే మరో రెండేళ్లలోనే మరోసారి ఎన్నికలు ఎదుర్కొవాల్సి వస్తుందని భయపడుతున్నారు.