
CM Relief Fund
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.
చిట్యాల నేటి ధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో సీఎం సహాయనిధి ఆపద్భాందవునిలా ఆదుకుంటుందని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని సీఎం సహాయనిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరగా నిలుస్తుందన్నారు. బాధితులకు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయశ్రీ తాసిల్దార్ ఇమామ్ బాబా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీకృష్ణ చిలకల రాయ కొమురు జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య యూత్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్, టేకుమట్ల చిట్యాల పలువురు మండల కాంగ్రెస్ నేతలు, లబ్ధిదారులు కార్యకర్తలు, పాల్గొన్నారు.