స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీదే గెలుపు
మాటేడు ఎంపీటీసీ పరిధి లో
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని బిఆర్ఎస్ తొర్రూర్ మండల పార్టీ ఇన్చార్జ్ శ్రీరామ్ సుధీర్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు మరియు మాజీ జెడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ గార్లు అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి:
గౌరవ శ్రీ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు* చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది
తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు చేసింది ఏమీలేదు అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలలో కోతలు ఎగవేతలు తప్ప చేసింది ఇచ్చింది శూన్యం అన్నారు..
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తగిన బుద్ధి చేపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రైతు బంధు రెండు పంటలకు ఎగనామం పెట్టారని రైతు రుణమాఫీ 60% రైతులకు కూడా జరగలేదని తెలిపారు.
మహిళలకు తులం బంగారం మరియు 2500 రూపాయలు ఇస్తానని మోసం చేసారు. భూమి లేని పేదలకు 12000 ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు.
మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మొదలు పెట్టిన అభివృద్ధి పనులు ఎందుకు పూర్తి చేయలేదని స్థానిక ఎంఎల్ఏ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు..
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరింది.తప్ప పేద ప్రజలకు వచ్చింది శూన్యం అన్నారు…
ఈ కార్యక్రమంలో తొర్రూర్ పట్టణ పార్టీ అధ్యక్షులు బిందు శ్రీనివాస్ ,తొర్రూర్ పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్ ,తొర్రూర్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, కాలు నాయక్ ప్యాక్స్ డైరెక్టర్ జనార్దన్ రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు సముద్రాల శీను, బిక్షపతి గ్రామ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ మరియు సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు