నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం

నాల్గవ తరగతి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం

ఎల్లప్పుడూ ఉద్యోగులకు అండగా ఉంటాం జిల్లా అధ్యక్షులు గీట్ల సుమిత్

మంచిర్యాల జులై 01 నేటి దాత్రి :

 

 

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం సర్వ సభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు గీట్ల. సుమిత్ అధ్యక్షత న నిర్వహించారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్నా సమస్యల పైన మరియు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన
బకాయి బిల్లుల మంజూరు ,
ఆరోగ్య కార్డులను పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని
నాల్గవ తరగతి ఉద్యోగులకు ప్రతి
2 సంవత్సరాలకు ఒకసారి పదోన్నతులు కల్పించాలనే ప్రభుత్వం జీఓ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వన్నీ కోరుతూ ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గీట్ల. సుమిత్ మాట్లాడుతూ
జిల్లా లోని మండల స్థాయి అధికారులు కొందరు నాల్గవ తరగతి ఉద్యోగుల పై అనుచిత పదాలు ,దురుసుగా ప్రవర్తిస్తున్నారని ,క్రింది స్థాయి ఉద్యోగులపై ఇలా ప్రవర్తించడం సరైనది కాదని, అలాంటి సందర్భాలు ఎదురైతే
జిల్లా సంఘానికి తెలియజేస్తే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకొన్ని వెళ్లి న్యాయం జరిగే వరకు తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ఎల్లపుడు ముందుగా ఉండి పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమములో గౌరవ అధ్యక్షులు తిరుపతి, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీలత, కోశాధికారి సుజాత,
సునీత, శేఖర్, ముంతాజ్ అలీ ఖన్,
శ్రీనివాస్, వెంకటేష్, సతీష్, శోభ తదితరులు
పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!