ధర్మ రావు పేట గ్రామంలో విద్యుత్ శాఖ పొలంబాట కార్యక్రమం
గణపురం నేటి ధాత్రి
గణపురంమండలంలోని ధర్మారావుపేట్ గ్రామంలో 01.07.2025 న “విద్యుత్ శాఖ – పొలంబాట” కార్యక్రమాన్ని, రైతుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. “విద్యుత్ శాఖ – పొలం బాట” ముఖ్య ఉద్దేశాన్ని ఎస్ ఈ వివరిస్తూ 1) వంగిన స్తంభాలను సరి చేయడం 2)విరిగిన లేదా ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు మార్చడం 3)కిందకు వేలాడుతూ ప్రమాదకంగా ఉన్న లూజు లైన్ ను సరిచేయడంమొదలగునవిచేస్తామని.విద్యుత్ వినియోగదారులు, రైతు సోదరులకు బట్టలు ఆరెసుకునే దండానికి జి ఐ వైర్ వాడకూడదు, జి ఐ వైర్ వాడడం వలన ఎలక్ట్రిక్ షాక్ కి గురి కావడం జరుగుతోంది.సర్వీస్ వైర్ లోజాయింట్లులేకుండాచూసుకోవాలి.సర్వీస్ వైర్స్ జాయింట్స్ ఉండడం వలన షాక్ కి గురి కావడం జరుగుతుంది.
అలాగే రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని, రైతులుభద్రతసూత్రాలను,విద్యుత్ పొదుపు పాటించాలని కోరారు.
ముఖ్యంగా, రైతులు తమ మోటార్స్ దగ్గర, తగిన కెపాసిటీ కలిగిన కెపాసిటర్స్ ను వాడాలని కోరుతు, ప్రయోగాత్మకంగా వారికి కెపాసిటరును మోటర్ దగ్గర అమర్చి చూపించి తగ్గిన కరెంటు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు కెపాసిటర్లను అమర్చుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల రైతు సోదరులు హర్షం వ్యక్తం చేసి విద్యుత్ శాఖా పనితీరు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.అలాగే రైతులు తమయొక్కసమస్యలను అధికారుల కు తెలిపారు. ఈ కార్యక్రమంలోజిల్లాసూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మల్చుర్, డిఈ టెక్నికల్ భూపాలపల్లి
వెంకటేశం, స్థానిక ఏ ఈ వెంకట రమణ, సబ్ ఇంజనీర్ రజినీకాంత్ విద్యుత్ శాఖ సిబ్బంది, రైతు సోదరులు పాల్గొన్నారు.