సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా.

MRO Office MRO Office

సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

 

 

 

సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇసుక మరియు ముడి సరుకుల ధరల్ని ప్రభుత్వం నియంత్రించాలి – అన్నల్ దాస్ గణేష్ సిపిఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి.

సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఇసుక కొరత తీర్చాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగినది.

ఈ సందర్బంగా సిపిఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ మాట్లాడుతూగత 15 రోజులుగా సిరిసిల్ల పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు మరియు ప్రైవేట్ ఇంటి నిర్మాణాలకు ఇసుక అనుమతులు లేకపోవడంతో ఇండ్ల నిర్మాణాలు ఆగిపోయాయి ప్రభుత్వ పనులకు ఇస్తున్న ఇసుక బ్లాక్లో నాలుగు వేల నుండి 5 వేలకు అమ్ముకుంటున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్లకు 10 ట్రాక్టర్ల ఇసుక మాత్రమే ఇస్తామని చెబుతున్నారు కానీ సిరిసిల్ల పట్టణంలో నల్ల రేగడి భూములు అయినందున పుటింగులకే పది ట్రిప్పుల ఉష్కే సరిపోని పరిస్థితి ప్రభుత్వం మరొక్కసారి ఆలోచించి ఇసుక ట్రిప్పుల సంఖ్య పెంచాలని అలాగే ప్రైవేట్ ఇంటి నిర్మాణాలకు కూడా ప్రతిరోజు ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని దానివలన పట్టణంలోని పేద ప్రజల పైన అదనపు భారాన్ని తగ్గించినట్టు అవుతుంది ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇతర ముడి సరుకుల ధరల్ని కూడా నియంత్రించాలి ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలి మైనింగ్ అధికారులు దాడులను ఆపాలి పేదల ఇంటి నిర్మాణాలకు అలాగే ప్రయివేట్ ఇంటి నిర్మాణదారులకు ఇబ్బందులు లేకుండా అధికారులు తక్షణమే చెర్యలు తీసుకోవాలని సిపిఎంసిరిసిల్ల జిల్లా కమిటీగా తహసీల్దార్ వినతిపత్రం అందించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, ఎగమాంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, శ్రీరామ్ రమేష్ చంద్ర సిపిఎం సీనియర్ నాయకులు మిట్టపెల్లి రాజమల్లు, రాపెల్లి రమేష్, నక్క దేవదాస్, జిందాం కమలాకర్, బెజగం సురేష్, సిరిమల్లా సత్యం, కోలా శ్రీనివాస్, బింగి సంపత్ సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!