రేషన్ బియ్యం పంపిణీ పై సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారుల ఆరా.

Food Corporation. Food Corporation.

రేషన్ బియ్యం పంపిణీ పై సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారుల ఆరా…

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలంలో పలు రేషన్ డిపోలను సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ అధికారులు తనిఖీ నిర్వహించారు రేషన్ డిపోలు వివరాలను తెలుసుకొని సరుకులను పరిశీలించారు ఈ తనిఖీలు సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జయప్రకాశ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అధికారులు తనిఖీలు చేపట్టారు బియ్యం పంపిణీ పై ఆరా ఈ సందర్భంగా సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జై ప్రకాష్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఘనపురం షాపు నెంబర్ మూడు రేషన్ డిపో తనిఖీ చేశామన్నారు ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్న విధానం రేషన్ బియ్యం వివరాలు నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నామని చెప్పారు ప్రజలకు సక్రమంగా రేషన్ బియ్యం అందించకపోతే రేషన్ షాపులపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వారి వెంట భూపాలపల్లి జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్ పలు మండలాల తాసిల్దార్లు అధికారులు ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!