మోడీ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలి.

Kumaraswamy. Kumaraswamy.

మోడీ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలి

సిపిఎం జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు

నర్సంపేట నేటిధాత్రి:

 

కేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాలని
సిపిఎం జిల్లా నాయకులు ఈసంపెల్లి బాబు అన్నారు.ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో నిర్వహించిన ఎమర్జెన్సీ వ్యతిరేక సదస్సు మండల కమిటీ సభ్యుడు అక్కపెల్లి సుధాకర్ అధ్యక్షతన జరిగింది.బాబు మాట్లాడుతూ 1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను తుంగలో తొక్కి దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష పార్టీల నేతలను, కార్యకర్తలను నిర్బంధించి నెలల తరబడి జైల్లోపెట్టారని, ప్రధానంగా సిపిఎం నాయకులపై తీవ్రనిర్భందం ప్రయోగించారని అన్నారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు దేశంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేశాయని పోరాటాలకు తలొగ్గి 21 నెలల అమలులో ఉన్న ఎమర్జెన్సీనీ ఎత్తివేశారని అన్నారు.

Kumaraswamy.
గత 10 సంవత్సరాలుగా దేశంలో అధికారం లో ఉన్న మోడి ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాశి, ప్రతిపక్ష పార్టీల నేతలను, కార్యకర్తలను జైల్లోపెడుతూ అప్రకటిత ఎమర్జెన్సీనీ దేశంలో అమలు చేస్తూ, దొంగేదొంగా దొంగా అన్నట్లు నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వడం మోడి దివాలాకోరుతనానికి నిదర్శనం అని పేర్కొన్నారు.నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడే నైతిక అర్హత మోడీకి లేదని అన్నారు. ప్రస్తుతం దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలుచేస్తున్న అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలను పొరటాల్లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ సదస్సులో మండల కార్యదర్శి బోళ్ళ సాంబయ్య, మండల కమిటి సభ్యులు పుచ్చకాయల నర్సింహ్మ రెడ్డి,కొంగర నర్సింహస్వామి,చల్ల నరసింహరెడ్డి,తాల్లపెల్లి రవి,నల్లగొండ మొగలి, పుచ్చకాయల మహేందర్ రెడ్డి,ఈసంపెల్లి మహేందర్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నర్సంపేట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో…

మోడీ పాలనలో అమలు అవుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమార స్వామి పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్బంగా వ్యతిరేక దీనంగా సిపిఎం పట్టణ కమిటి సభ్యులు కామ్రేడ్ గడ్డమిది బాలకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పార్టీ నాయకులు బుర్రి ఆంజనేయులు, అన్వర్,కందికొండ రాజు,కార్తీక్,అనీల్, ఫరీద,విజయ,స్వప్న,నాగమణి, రుదర్రపు లక్ష్మి ,శ్రీనివసరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!